ప్రతీ నెల 20వ తేదీ తర్వాతే జీతాలు పడుతున్నాయి – బొప్పారాజు

-

ప్రతీ నెల 20వ తేదీ తర్వాతే జీతాలు పడుతున్నాయన్నారు ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పారాజు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని…ఇస్తున్న జీతం కూడా 11వ పీఆర్సీ తగ్గించిందని ఆగ్రహించారు. 11వ పీఆర్సీ అరియార్స్ ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. సంవత్సరం నుంచి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జీతాలు ఇస్తున్నారు…పించనర్ల కు పింఛన్ కూడా తగ్గిపోయిందని తెలిపారు.

గత సంవత్సరం ఫిబ్రవరి 5 న ఉద్యోగుల సమస్యల పట్ల నిరసన తెలియ చేసాం..అప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిప్పులు చెరిగారు. మాకు రావాల్సిన డబ్బులు వేల కోట్ల రూపాయలు రావాలని..మా డబ్బుకు మాకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం చేతులు కట్టుకుని ఎన్ని రోజులు వేచి చూడాలన్నారు. మా బిడ్డల పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి…నా పిల్లల ఫీజుల కొసం,కుటుంబ సభ్యుల వైద్య కోసం డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పారాజు.

Read more RELATED
Recommended to you

Latest news