హుజురాబాద్ లో గుండాయిజం చేస్తే మాడి మసైపోతారు – ఈటెల రాజేందర్

-

జైలు నుండి విడుదలైన కమలాపూర్ బిజెపి నాయకులకు ఘన స్వాగతం పలికారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. మా నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ పగబట్టారని ఆరోపించారు ఈటెల రాజేందర్.

అందుకే చాలామందికి హుజురాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రశాంత వాతావరణ ఉందని, పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసిమెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజరాబాద్ అని కొనియాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అనేకమంది నియంతలను చూశామని, వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో గుండాయిజం చేసే ప్రయత్నం చేస్తే మోడీ మసైపోతారని హెచ్చరించారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంతవరకు నిద్రపోయేదే లేదన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news