అది జగన్ ఆలోచన, ఎవరు ఆపినా ఆగదు: ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

-

విజయవాడ మధురా నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయన్నారు. 17 కోట్లు ప్రభుత్వ నిధులు,10 కోట్లు రైల్వే నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాబోతోందని స్పష్టం చేసారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని అన్నారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం తలపెట్టారన్నారు. టీడీపీ నాయకులు దీనికి అడ్డుపడి స్టే తెచ్చినా ఏదో ఒక టైంలో తీర్పు వస్తుంది ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేసారు. శాసన రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాం అని కొడాలి నాని అనలేదని అన్నారు. మానవత్వంతో రైతులు ఆలోచించాలని కొడాలి నాని ఉద్దేశం తప్ప ఇందులో ఏమి లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news