ఏపీ విద్యార్థులకు శుభవార్త..ప్రతి క్లాస్‌ రూంకు స్మార్ట్‌ టీవీలు

-

విజయవాడ ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్దాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరుతున్నానని వివరించారు.

ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసే ఆలోచనను విద్యార్థులు గుర్తించాలని కోరారు. రాబోయే కాలంలో కమ్యూనికేషన్ ఆధారంగా ప్రతి తరగతిలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి గోరు ముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news