భారత సినీ పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం విశ్వనాథ్‌: బ్రహ్మానందం

-

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఫిలింఛాంబర్‌లో విశ్వనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

అనంతరం బ్రహ్మానందం మీడియాతో మాట్లాడుతూ.. “‘పుట్టిన ప్రతి వాడూ చనిపోకతప్పదు. కానీ, అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్‌గారు .. కళ బతికున్నంత కాలం, కళాకారులు బతికున్నంతకాలం మనతోనే ఉంటారు. ఆయన దర్శకత్వంలో నేను రెండు సినిమాల్లో నటించా. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. నెలరోజుల కిందట కలిసినప్పుడు ‘బ్రహ్మం.. తరచూ కలుస్తూ ఉండు’ అన్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. భారత చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం కళాతపస్వి విశ్వనాథ్ గారు.” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news