బ్రేకింగ్:ఏపీలో ఒక్క రోజే 11 వేల కేసులు, 97 మరణాలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 10 వేల 820 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క రోజే 1543 మందికి కరోనా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో 1399 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1132 మందికి కరోనా వహ్హింది. విశాఖలో 961 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 2 లక్షల 27 వేల 860 గా ఉన్నాయి.

ap-corona
ap-corona

యాక్టివ్ కేసులు 87 వేల 112 ఉన్నాయి. అదే విధంగా లక్షా 38 వేల 712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 2036 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 97 మంది గత 24 గంటల్లో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 9 వేల 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 24 లక్షల 87 వేల 305 పరిక్షలు ఏపీలో చేయగా గత 24 గంటల్లో 62 వేల 912 మందికి కరోనా పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news