బ్రేకింగ్:పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి దూకుడు

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. 150 డివిజన్లకు గానూ 30 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో బిజెపి దూకుడు ప్రదర్శిస్తుంది. హైదర్ నగర్ లో 3 బిజెపి 1 తెరాస కు వచ్చాయి. గచ్చిబౌలి లో 5 బిజెపికి వచ్చాయి. తెరాస కు మూడు వచ్చాయి. గాజుల రామారం, శేరిలింగం పల్లిలో బిజెపికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

ఇప్పటి వరకు బిజెపి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా రెండు స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది. దీని ఆధారంగా చూస్తే ఉద్యోగులు తెరాస పై సీరియస్ గా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేసారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి దూకుడు ప్రదర్శిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news