బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల్లో గెలిచేది బీజేపీ !

-

ఈ రోజు సాయంత్రంతో కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సమయం ముగియనుంది. దీనితో ఉన్న ఈ కాస్త సమయాన్ని ఉపయోగించుకోవడానికి అధికార పార్టీ బీజేపీ మరియు కాంగ్రెస్ మద్దతు పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి, కాగా ఈ నెల 12వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తాజాగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కర్ణాటక ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే పార్టీ బీజేపీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా ఏకంగా వచ్చే సీట్ల గురించి కూడా చెప్పడం ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుస్తోంది. ఇక్కడ గెలిచేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కాకుండా 15 సీట్లు ఎక్కువగానే వస్తాయి అని చెప్పారు.

అంతే కాకుండా దక్షిణాదిన బీజేపీ మరింత బలపడుతోందని తెలంగాణాలో అధికారంలోకి వస్తామని చెప్పారు. మరి అమిత్ షా చెప్పినట్లు జరుగుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news