బ్రేకింగ్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్ ని విడుదల చేసారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 53 వేల కరోనా పరిక్షలు చేయగా 8 వేల 732 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజే 10 వేల 414 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మరణాలు కూడా ఏపీలో తగ్గాయి. 87 మంది మాత్రమే మరణించారు నిన్న. ఏపీలో ఇప్పటి వరకు 28 లక్షల 12 వేలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.

ap-corona
ap-corona

రాష్ట్రంలో మరణాలు 2 వేల 562 కి చేరాయి. మొత్తం కేసులు 28 వేల 817 కి చేరుకున్నాయి. ఒక లక్షా 91 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిన్న ఒక్క నాడే 1126 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 88 వేలకు పైనే ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news