బ్రేకింగ్ న్యూస్: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల “హవా” !

-

కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మాములుగా సాయంత్రం 5 గంటలకు విడులా చేయాల్సిన ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాల వలన కాసేపటి క్రితమే బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఫలితాలలో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫలితాలు చెబుతున్నాయి. కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షకు హాజరయిన వారిలో 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా , రెండవ సంవత్సరంలో 72 శాతం మంది పాస్ అయ్యారు.

ఇక రెండు సంవత్సరాల ఫలితాలను బట్టి చూస్తే అమ్మాయిలే ఎక్కువ శాతం పాస్ అయ్యారు. సాధారణంగా ఎప్పుడూ అమ్మాయిలే తమ ప్రతిభను చూపిస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా అదే విధంగా జరగడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news