బ్రేకింగ్ న్యూస్: టీటీడీ లో భారీ జీతంతో ఉద్యోగాలు…!

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అలమటిస్తున్నారు అని చెప్పాలి. ఎక్కడ నోటిఫికేషన్ విడుదల అయినా అప్ప్లై చేయడానికి పోటీ పడి మరీ ఉద్యోగాలను దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వెలసియున్న కలియుగ దైవం తిరుమలేశుడు సన్నిధిలో కొలువులకు నోటిఫికేషన్ విడుదల అయింది. టీటీడీ ప్రకారం మొత్తం 56 పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని వీటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలలో AEE, AE, మరియు ATO పోస్ట్ లకు గాను ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబ్ లకు కేవలం ఆంధ్రప్రదేశ్ లోని హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

ఇక ఈ జాబ్ కోసం బి టెక్ ఉత్తీర్ణత అయి ఉండాలి, అభ్యర్థి వయసు 42 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష మరియు ఇంటర్ వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు అప్లై చేసుకుని ఉద్యోగాన్ని పొందగలరు.

Read more RELATED
Recommended to you

Latest news