BREAKING: TSRTC ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు !

-

దాదాపు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన డీఏ ల విషయం ఎట్టకేలకు ఈ రోజుతో పరిష్కారం అయింది అని చెప్పాలి. ఈ విషయం గురించి కొంతకాలం క్రితమే సీఎం కేసీఆర్ ఖచ్చితమైన హామీలను ఇవ్వగా, ఈ రోజు కాసేపటి క్రితమే ఆ హామీలను నెరవేర్చినట్లు తెలియచేసి ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురును అందించారు. దసరాకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కానుకను అందిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉద్యోగులకు 4 .85 శాతం తో డీఏ ను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఇక ఇది మాత్రమే కాకుండా అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు TSRTC తెలపడం విశేషం. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా పెండింగ్ లో ఉన్న మొత్తం 9 డీఏ లను విడుదల చేసింది.

సీఎం కేసీఆర్ వీరికి మాట ఇచ్చిన విధంగా నిలబెట్టుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున ఇది ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుకా అంటూ ప్రకటించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news