BREAKING: అమిత్ షా తో ఎన్టీఆర్ లంచ్ భేటీ

-

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి ఆదివారం మునుగోడు సమరభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభకి బిజెపి ఆగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హాజరవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు.

లంచ్ మీట్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరగనుంది. అమిత్ షా తో డిన్నర్ కు ఎన్టీఆర్ ని ఆహ్వానించారు బిజెపిి నేతలు. వీరిద్దరూ ఏ ఏ అంశాలపై చర్చిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాను చూశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అందులో ఎన్టీఆర్ నటనకు అమిత్ షా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. సినిమాతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news