మరి కొన్ని గంటల్లో పెళ్లి…అనుమానాస్పద స్థితిలో పెళ్ళికొడుకు మృతి !

-

అసలే కరోనా సమయం, పెళ్ళిళ్ళు చాలా తక్కువగా జరుగుతున్నాయి. చాలా మంది ముందే అనుకున్న పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటే కొంత మంది మాత్రం తెగించి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒక పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్ళికి ముందు రోజునే పెళ్ళి కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలo ఆమనగల్ గ్రామంలో మరి కొద్ది గంటల్లో పెళ్ళి జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది.

bride groom passes away after the next day to his marriage
bride groom passes away after the next day to his marriage

వివరాల్లోకి వెళ్తే ఆమనగల్ గ్రామానికి చెందిన నరేష్ కు ఈరోజు పెళ్లి జరగాల్సి ఉంది. ఈరోజు రాత్రికి పెళ్లి ముహూర్తం ఉండగా నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో పెళ్ళికొడుకు నరేష్ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాలలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులకి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను గుండె పోటుతో మృతి చెందాడని భావిస్తున్నారు. అయితే దీని మీద అధికారిక ధృవీకరణ అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news