కెసిఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాలేశ్వరం కమిషన్ విచారణ హాజరుపై బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈనెల 5వ తేదీన కాలేశ్వరం కమిషన్ విచారణకు కేసిఆర్ వెళ్లాల్సి ఉండగా ఆ తేదీని వాయిదా వేసుకున్నారు. ఈనెల 11వ తేదీన విచారణకు హాజరు అవుతానని చెప్పారు. ఈ విషయాన్ని కెసిఆర్ తెలియజేయగా దానికి కమిషన్ అంగీకరించింది.

ఇదిలా ఉండగా… గత కొద్ది రోజుల క్రితం కల్వకుంట్ల కవిత కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీ గురించి బహిరంగంగా లేఖ రాయడం సంచలనంగా మారింది. కవిత బహిరంగంగా లేఖ రాయడంతో కేటీఆర్ సీరియస్ అయ్యారు. మరోవైపు కవిత జాగృతి పేరుతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇకనుంచి జాగృతి పేరుతోనే కార్యక్రమాలు నిర్వహిస్తానని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి మాత్రం రానని కవిత వెల్లడించారు.