BREAKING : పొంగులేటి, జూపల్లిపై BRS వేటు

-

సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార బీఆర్ఎస్ పార్టీ. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న…సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై సస్పెండ్ వేటు వేసింది బీఆర్ఎస్ పార్టీ.

వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సస్పెండ్ చేసింది కెసిఆర్ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కాగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లిన 24 గంటల లోపే వారిపై వేటు పడింది. ఇక ఈ ఇద్దరు నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news