BRS నేతలు ఏ తప్పు చేయలేదు – కొప్పుల ఈశ్వర్

-

బిఆర్ఎస్ నేతలు ఏ తప్పు చేయలేదని అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు పంపిందని విమర్శించారు. తెలంగాణలో అధికారాన్ని చేచిక్కించుకోవడానికి బిజెపి దుర్మార్గపు విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు.

కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదన్నారు కొప్పుల ఈశ్వర్. విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం కక్ష సాధిస్తుందని విమర్శించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్ మాటలకు అర్దం లేదన్నారు కొప్పుల ఈశ్వర్. దేశంలో అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రుల మీద ఇలాంటి దాడులే చేశారని.. లొంగిపోతే వైఖరి మార్చుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news