ఏపీ స్నేహితుడు మాట్లాడ‌ట్లేద‌ని విద్యార్థిని ఆత్మ‌హత్య‌..!

-

విజ‌య‌వాడ కానూరులోని ఓ ప్రైవేటు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో బీటెక్ చ‌దువుతున్న రోహిత అనే విద్యార్థిని త‌న స్నేహితుడు మాట్లాడ‌టం లేదని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. లోహిత స్థానికంగా ఉన్న ఓ హాస్ట‌ల్ లో ఉంటోంది. అయితే రీసెంట్ గా రోహిత త‌న తల్లి దండ్రుల‌కు ఫోన్ చేసి త‌న‌తో త‌న స్నేహితుడు మాట్లాడ‌టం లేదని ఇద్దరి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని చెప్పింది. దాంతో తాము వ‌చ్చి మాట్లాడ‌తామ‌ని చెప్పారు.

crime
crime

అయితే మంగ‌ళవారం మ‌ద్యాహ్నం నుండి రోహిత త‌ల్లి దండ్రులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్త‌లేదు. దాంతో కుటుంబ సభ్యుల‌కు అనుమానం వ‌చ్చి మంగ‌ళ‌వారం హాస్ట‌ల్ గ‌దికి వెళ్లి చూడ‌గా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news