ఈ నెల 9న ఒరిస్సాకు సీఎం జగన్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… ఒరిస్సా లో పర్యటించనున్నారు. ఈ నెల 9 వ తేదీన భువనేశ్వర్‌ లో పర్యటించనున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి మాట్లాడనున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు.

jagan
jagan

వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా పోలవరంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉందన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఒడిషా సీఎం తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలవనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కాగా నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలనిఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని గతంలో నవీన్ పట్నాయక్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news