విజయసాయి, జగన్‌ కు విభేధాలు వచ్చాయి – బుద్ధా వెంకన్న

-

విజయ సాయిరెడ్డి, జగన్‌ కు విభేధాలు వచ్చాయని.. సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బుద్ధ వెంకన్న కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. బుద్ధా వెంకన్న కేశినేని చిన్ని, నాగుల్ మీరా ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ రాష్ట్ర నాయకుడు కాదు జాతీయ నాయకుడు.. జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్ అన్నారు. విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్రలో రూ. 50వేల కోట్లు దోచేశాడు.. ఆ వాటాల దగ్గరే సీఎంకు, విజయసాయి రెడ్డికి తేడాలు వచ్చాయని.. ఇప్పుడు జగన్ రూ. 5 లక్షల కోట్లు దోచేయడానికి దుకాణం విశాఖకు మారుస్తానంటున్నాడని ఆగ్రహించారు. నేను కూడా విశాఖలోనే మకాం పెట్టి మీ అవినీతిని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖలో కబ్జా చేసిన భూములన్ని బాధితులకు అప్పగిస్తామని ప్రకటించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.

 

Read more RELATED
Recommended to you

Latest news