ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు… ఆ రోజే మంత్రులతో ప్రమాణ స్వీకారం

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే మంత్రి వర్గ కూర్పుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఎప్రిల్ 11న ఉదయం 11.31 నిమిషాలకు బలమైన ముహూర్తం ఉందని.. ఆ మూహూర్తానికే కొత్త మంత్రులతో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి పదవుల్లోకి తీసుకోవాలి… ఎవరిని పదవుల్లోంచి తప్పించి పార్టీ బాధ్యతలను అప్పగించాలనే దానిపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ భువనేశ్వర్ పర్యటనలో ఉన్నారు. అనంతరం విజయవాడ చేరుకుని ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన ముగిశాక సీఎం జగన్, గవర్నర్ ని కలువనున్నారు. కొత్తగా మంత్రులుగా ఎవరెవరిని తీసుకున్నారనే వివరాలను గవర్నర్ ముందుంచనున్నారు. ప్రమాణ స్వీకారం గురించి కూడా గవర్నర్ కు సీఎం జగన్ తెలియజేయనున్నారు. ఇప్పటికే సామాజిక, ప్రాంతీయ అంశాలను బేరీజు వేసుకుని మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news