విశాఖ ఏజెన్సీలో తెలంగాణ పోలీసులపై దాడులు.. కాల్పులకు దిగిన పోలీసులు !

-

నల్గొండ : విశాఖ ఏజెన్సీ లో చెలరేగిపోయారు గంజాయి స్మగ్లర్లు. గంజాయి స్మగ్లర్ల ను వెంటాడుతూ లంబసింగి ఘాట్ రోడ్డుకు వచ్చిన నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఈ నేపథ్యంలోనే నల్గొండ పోలీసులల పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు స్మగ్లర్లు. అయితే… ఆత్మ రక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారు నల్గొండ పోలీసులు. ఈ ఘటనపై నల్గొండ డిఐజీ ఎస్పీ రంగనాధ్ అధికారిక ప్రకటన చేశారు.

లంబసింగి నర్సీపట్నం అటవీ ప్రాంతం లో గంజాయి ముఠాల కోసం నల్గొండ పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. విశాఖ ఎజన్సీలో గంజాయి ముఠాల కోసం నల్గొండ జిల్లా కు చెందిన పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నట్లు వివరించారు.

గాలింపు లో గంజాయి ముఠాల దాడిలో నల్గొండ పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అందులో ఓ బృందం పై గంజాయి స్మగ్లర్లు దాడి చేసారని.. ఈ సంఘటన లో.. పోలీసు వాహనం అద్దం పగిలినట్లు సమాచారం ఉందన్నారు. నల్గొండ పోలీసులకు ఎస్పీ సహకారం ఉందని తెలిపారు. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news