లైగర్ సినిమాలో కల్వకుంట్ల కవిత పెట్టుబడి.. ఈడికి ఫిర్యాదు

-

ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మీద సరికొత్త ఫిర్యాదు అందింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ లైగర్” సినిమా నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు పెట్టీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) కి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకునేందుకే ఎమ్మెల్సీ కవిత సినిమాలో పెట్టుబడి పెట్టారని బక్క జడ్సన్ ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు. బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ సినిమా నిర్మాణంలో ఉన్నారని.. ఇంత డబ్బు ఏం చూసి పెట్టారని ప్రశ్నించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకు రావడంతో కవిత తన పేరు ఉపయోగించకూడదు అంటూ కోర్టుకు వెళ్లి ఒక స్టే తెచ్చుకున్నారని.. అదే రోజు విజయ్ దేవరకొండ ఎన్ని అవంతరాలు వచ్చినా కొట్లాడుదాం అంటూ ట్వీట్ చేశాడని, ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ గా తనకు అనిపిస్తున్నాయని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news