హైదరాబాద్ లో కారు భీబత్సం.. రోడ్డు దాటుతున్న ఇద్దరి మృతి !

-

అదేంటో తెలీదు కానీ హైదరాబాద్ లో కార్లు భీబత్సం సృష్టిస్తున్నాయి. మొన్న కుకట్ పల్లి ఘటన మొదలు రోజూ ఎక్కడో ఒక చోట అదుపు తప్పి యాక్సిడెంట్ లు అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో కారు భీబత్సం సృష్టించగా రోడ్డు దాటుతున్న ఇద్దరి మృతి చెందారు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ నగర్ – దిల్ షుక్ నగర్ ప్రధాన రహదారి మీద అధిక వేగంతో , నిర్లక్ష్యంగా దూసుకు వచ్చిన TS 13 UA 7633 నెంబర్ గల కారు ఇద్దరినీ పొట్టన బెట్టుకుంది.

చైతన్య పురి యూ టర్న్ వద్ద రోడ్డు దాటుతున్న రవి అనే 50 ఏళ్ళ వ్యక్తిని ధన్ రాజ్ అనే 25 ఏళ్ళ వ్యక్తిని ఇద్దరిని ఢీ కొట్టింది. అయితే ఆ ఢీ కొన్న వేగానికి వారిద్దరి శరీరాలు ఎగిరి పడ్డాయి. పడడంతోనే వారిద్దరూ అక్కడికక్కడ మృతి చెందారు. అయితే వారిని ఢీకొట్టి కారులోని వారు ఆగకుండా పరారయ్యారు. కారు నెంబర్ ద్వారా సరూర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఆ రెండు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news