టాలీవుడ్ నటుడు నరేష్ మాజీ భార్యపై కేసులు నమోదు

-

టాలీవుడ్ నటుడు నరేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. నటుడు నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి పై ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన భార్య పై కేసు నమోదు అయింది. రమ్య రఘుపతి వసూళ్లకు… తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా నరేష్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్ లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమెపై ఐదుగురు మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేశారు.

కాగా నటుడు నరేష్ కు రమ్య రఘుపతి మూడో భార్య. రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య రఘుపతి ని ఎనిమిది సంవత్సరాల క్రితం నరేష్ వివాహం చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని సమాచారం.

నరేష్ కు ఉన్నటువంటి ఆస్తులను చూపించి ఆ ఆస్తి అంతా తనకే చెందుతుందని చెబుతూ చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే బాధితులు కూడా ఒక్కో విధంగా చెపుతున్నారు. ఐదుగురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమ్య రఘుపతి నీ పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news