BREAKING : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

-

వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు ఇచ్చింది. పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీబీఐ అధికారులు..కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసు ఇచ్చింది.

ఈ నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. నాలుగు రోజుల క్రితం నేడు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసారు సీబీఐ అధికారులు. ముందస్తు షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని చెప్పిన ఎంపీ.. వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇక 12న కడపలో విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news