కేంద్రం మరో కీలక నిర్ణయం… రోడ్డు, విద్యుత్ రంగాలు ప్రైవేట్‌ పరం..!

-

కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి మరియు బీఎస్ఎన్ ఎల్  లాంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయగా…. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్…. 6 కోట్ల లక్షల రూపాయల సమీకరణ లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరనే లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల ఆస్తుల అమ్మకం తో ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయలను సమీకరించిన వచ్చని ఆమె వెల్లడించారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులను సమీకరించి కోవచ్చని అభిప్రాయపడ్డారు నిర్మలా సీతారామన్. అయితే ఈ ఆస్తుల యజమాన్య హక్కులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news