బ్రేకింగ్ : తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక… తరుము కొస్తున్న వేళ… తెలంగాణ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

అలాగే  బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిషోర్, శుభ ప్రద పాటిల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు బీసీ కమిషన్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక బీసీ కమిషన్ చైర్మన్ గా నియామకమైన వకుళా భరణం కృష్ణ మోహన్ గతంలో…. బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేసి… ఈసారి చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. అయితే వకుళా భరణం కృష్ణ మోహన్ హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు కావడం గమనార్హం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో… ఎలాగైనా గెలవాలని నేపథ్యంలో… వకుళాభరణం కృష్ణమోహన్ కు ఈ పదవిని కట్టబెట్టి నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news