బ్రేకింగ్ : బాబు సహా 13 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

-

ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సమావేశాలు రసాభాసగా మారాయి. సభ జరుగుతుండగా స్పీకర్ వెల్ వద్దకు వెళ్లి చంద్రబాబు బైఠాయించారు. ఎమ్మెల్యే రామానాయుడు పై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వెల్లో చంద్రబాబు కూర్చున్నారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు కూడా భైఠాయించారు. దీంతో బాబు సహా టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మనించగా దానికి స్పీకర్ ఆమోదం తెలిపారు.

దీంతో బాబు సహా మిగిలిన 13 మంది టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులులాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. వీడియోలు తీయొద్దంటూ మార్షల్స్ అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో మార్షల్స్ తో ఎమ్మెల్యేలు పయ్యావుల, నిమ్మల వాగ్వాదానికి దిగారు. వీడియోలు తీయనివ్వకుండా ఆందోళన చేస్తున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకు అడ్డంగా నిలుచున్నారు మార్షల్స్.

Read more RELATED
Recommended to you

Latest news