కోహ్లీ కెప్టెన్సీ విచిత్రంగా ఉంది..!

-

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన మొదటి వన్డే సిరీస్లో భారత్ రెండు మ్యాచ్లలో పరాజయం పాలై సిరీస్ చేజార్చుకోవడం పై ప్రస్తుతం విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేశాడు. బౌలింగ్ విభాగాన్ని సరిగ్గా ఉపయోగించు కోవడంలో కోహ్లీ విఫలమయ్యాడు అంటూ ఘాటుగా స్పందించాడు

ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టులో టాప్ ఆర్డర్ వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ముందుగా వికెట్ తీసే బౌలర్లను ఉపయోగించుకోవాలి అలాంటిది.. ప్రధాన బౌలర్లను రెండు ఓవర్లు కే పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆస్ట్రేలియాలో ఓటమి పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతం గంభీర్.

Read more RELATED
Recommended to you

Latest news