వంగవీటి రాధా ఎపిసోడ్ పై డిజిపికి చంద్రబాబు ఫిర్యాదు

-

అమరావతి : వంగవీటి రాధాపై రెక్కి విషయమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

రాధాపై రెక్కి విషయంలో పారదర్శకంగా విచారణ జరుగుతుందని.. ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గద్దని కోరారు చంద్రబాబు. ఏపీలో అటవిక, గుండా రాజ్యం నడుస్తోందని.. రాధాపై రెక్కి నిర్వహించేంత వరకు పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితేంటో అర్థం అవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక అంతకు ముందు వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వంగవీటి రాధాపై రెక్కి నిర్వహించిన వ్యవహారంపై ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్న చంద్రబాబు నాయుడు… తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news