రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళి

-

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, ఈనాడు మాజీ ఎడిటర్ రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రామోజీ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు బేగంపేట ఎయిర్ ఫోర్ట్ లో దిగారు. అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిలింసిటీకి బయలుదేరారు. అలాగే సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫిలింసిటీకి వెళ్లి రామోజీ పార్థివ దేహాన్ని సందర్శించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news