రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి – చంద్రబాబు

-

కుప్పంలో జరిగిన అరాచకాలపై సంఘీభావం చెప్పడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యం లో జరగరానివి జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. వైస్సార్ పార్టీ గుండాలతో గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయన్నారు.

40 ఏండ్ల క్రితం ఇదే రోజు ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని.. 40 ఏండ్లలో ఇలాంటి చర్యలు ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడితే దాడులు చేయించడం పనిగా పెట్టుకున్నారని.. జీవో 1 ఏంటో అర్థం కావడం లేదన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తెచ్చారని ఆరోపించారు. ఉన్మాదులుగా నా నియోజకవర్గం వెళ్తా అంటే ఘర్షణ వాతావరణం చెలరేపారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news