చంద్రబాబు నాలుగు దశాబ్దాల నుండి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాడు – డిప్యూటీ సీఎం కొట్టు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు దశాబ్దాల నుండి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని విమర్శించారు. చంద్రబాబు వర్గ ప్రయోజనాల కోసమే పని చేస్తాడని.. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ దుయ్యబట్టారు.

గూగుల్ లో వీటి పేర్లు కొడితే చంద్రబాబు ఫోటో వస్తుందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా పవన్ కళ్యాణ్ మతి కూడా పోయిందన్నారు. తనకి పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే జాలి కలుగుతుందని సెటైర్లు వేశారు. వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు వచ్చే జనం ఇప్పుడు వందలలోకి పడిపోయారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news