పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ ఉత్తరకుమార ప్రగల్బాలే

-

  • అన్నీ చేతగాని మాటలు…. సినిమా డైలాగులు
  • ఇదేందని విస్తుపోతున్న అభిమానులు
  • పవన్ భ్రమల్లో ఉన్నాడని అంటున్న విశ్లేషకులు

గాలిలో కత్తులు తిప్పుతూ యుద్ధం చేయడం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసని మరోసారి నిరూపించాడు. గాలిలో కత్తులు తిప్పడం అంటే బిల్డప్ యుద్ధం చేయడమే. తలలు తెగిపడేది లేదు యుద్ధం లో గెలిచేది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. ఈ బండారాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే బయట పెట్టేశాడు పవన్. అభిమానులు గ్రహించాక కవర్ చేద్దామన్నా చేతకాక బొక్క బోర్లా పడ్డాడు ఈ హీరో. చివరికి గాలిలో తిప్పిన కత్తిని చంకలో పెట్టుకుని వెనుదిరిగే పరిస్థితి తప్పేటట్లు లేదు పాపం ఈ ఉత్తర కుమారుడికి.

పవన్ లో నాయకుడి లక్షణాలు లేవు అనేందుకు ఉదాహరణ ఆయన ఇటీవల నోటిదూలకొద్దీ చేసిన వ్యాఖ్యలే. వైసీపీ నేతలందరూ అక్రమార్కులేనన్న పవన్ తనకు అధికారమిస్తే సంకెళ్లు వేసి రోడ్లమీద కొట్టుకుంటూ తీసుకెళ్తానన్నాడు. అంటే నాయకుడి లక్షణం ఇది కాదు అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే మరోసారి తన దరిద్ర భావజాలాన్ని బయటపెట్టుకున్నాడు ఈ ఉత్తముడు. అదేంటంటే ఏళ్ల తరబడి కాపు ఉద్యమాన్ని మోస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభం లాంటివారిని అవమానకరంగా మాట్లాడటం.

ఇలాంటి సోయ లేని మాటల వలన తాను ముమ్మాటికీ చంద్రబాబు పాలేరునే అనే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. గత టిడిపి హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అవమాన పరుస్తూ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం సర్కారులో భాగస్వామిగా ఉన్న పవన్ ఎందుకు ప్రశ్నించలేదో మరి.కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడే బయటపెట్టుకోవచ్చుగా. అంటే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన మాముళ్ళతో మునిగితేలాడు ఈ డాoబికాలు పలికే ఉత్తర కుమారుడు.

నేడు మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అంటే గతంలో కంటే ఎక్కువ మొత్తం ఈసారి ఇస్తామన్నారేమో ఇప్పుడు ఒంటరిగా జనాభాలోకొచ్చి సినిమా డైలాగులు చెప్పుకుంటూ తెగ అరుస్తున్నాడు. కాపు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ ముద్రగడ లాంటి మచ్చలేని నాయకుడి మీద అనవసర నిందలు వేస్తున్నాడు. ఈ వ్యవహారం అతని స్థాయిని ప్రజల్లో మరింత దిగజార్చింది. ముద్రగడ, ద్వారంపూడి వంటివాళ్ళను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించడం ద్వారా పవన్ లో రాజకీయ పరిజ్ఞానం లేదని తేలిపోయింది. టీడీపీ ఇచ్చిన ప్రసంగాన్ని తన సినిమా స్టైల్లో చదవడం, ఏరోజుకారోజు మామూళ్లు తీసుకోవడం తప్ప మరొకటి లేదని అశేష అభిమాన యువతకు అర్థమైపోయింది.

ప్రజల మనస్సుని గెలుచుకోలేక చతికిల బడ్డ ఈ పవణుడు ఈసారి కూడా ఓడిపోతాను అని ఫిక్స్ అయినట్టున్నాడు. చంద్రబాబు దగ్గర తాయిలాలు పుచ్చుకుని ఎవరిమీద అరవమంటే వాళ్ళమీద పడి మొరిగే దారుణ స్థితికి వచ్చేసాడు పవన్.అందుకే తాను మళ్ళీ ఓడిపోతాను అని లోలోపల ఏడుస్తూనే తాను క్రిమినల్స్ తో యుద్ధం చేస్తానని, అదేదో ట్రీట్మెంట్ ఇస్తానని రెచ్చిపోతున్నాడు. గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు మోసుకెళ్ళి చంద్రబాబుకు అమ్ముకుని సొమ్ము చేసుకునే ఉద్దేశ్యంతో మొదలైన వారాహి యాత్ర లక్ష్యం లేకుండా పోతోంది. కాపు యువతతో పాటు అభిమానులు సైతం పవన్ వ్యవహారం చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇది తెలిసి కూడా పవన్ యాత్ర కొనసాగిస్తాడో లేక ఉమ్మేసినా తుడుచుకుని వేళ్తాడో చూడాలి మరి…..

Read more RELATED
Recommended to you

Latest news