ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. వీడియో కూడా..!

-

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీ యువకుడిపై అక్రమ కేసులు బనాయించారని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొడవళూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన కరాకట మల్లికార్జున్ పై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్ పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు అతనిపైనే రౌడీ షీట్ తెరిచారని చెప్పారు. పైడేరు కాల్వలో వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకే ఈ విధంగా మల్లికార్జున్‌ని వేధించారని లేఖలో చంద్రబాబు తెలిపారు.

ఒక ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఇలా చేయటం దుర్మార్గమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేని విధంగా పోలీసు చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అసలు నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుని మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని కోరారు. మల్లికార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన కొడవళూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. మల్లిఖార్జున్‌పై దాడికి సంబంధించిన ఓ వీడియోను కూడా చంద్రబాబు లేఖకు జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news