ఢిల్లీ చేరిన చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ !

-

కాసేపటి క్రితమే ఏపీ టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా అమిత్ షా మరియు ప్రధాని నరేంద్ర మోదీ లతో భేటీ అయ్యి రాజకీయంగా కొన్ని కీలక విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రచారంలో ఉన్న విధంగా… చంద్రబాబు కేవలం ఆంద్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు మరియు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి కీలకంగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో బీజేపీ మరియు జాన్సెన పార్టీలు ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా ఎన్నికలకు రెండు పార్టీలు కలిసే వెళ్తామని ప్రకటించడంతో… ఈ విషయం కూడా ఈ రోజు చర్చలోకి వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ను ఫోన్ లో తీసుకుని ఇందులో ఒక క్లారిటీ తీసుకునే విధంగా ప్రణాళిక ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసి ఇదే విషయాలపై మాట్లాడుతారట.

Read more RELATED
Recommended to you

Latest news