కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తాం. : చంద్రబాబు సంచలనం

-

కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన తెచ్చారని.. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏకపక్షంగా జిల్లాల విభజన జరిగిందని.. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు.

స‌మ‌స్యలు త‌లెత్తేలా నిర్ణయాలు ఉండ‌కూడ‌దని.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆరును ఎవ‌రు గౌర‌వించినా స్వాగ‌తిస్తామని.. ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదు.. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు.

హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించారని.. వైఎస్ పేరు క‌డ‌ప జిల్లాకు పెట్టిన‌ప్పుడు వ్యతిరేకించ‌లేదని గుర్తు చేశారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండ‌వని.. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్టును నిలిపేశారని మండిపడ్డారు. ఎన్టీఆరుపై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మరన్నారు. చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీల‌ను కూడా జ‌గ‌న్ నిలిపి వెయ్యడం నిజం కాదా..?అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news