23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు – చంద్రబాబు

-

23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇవాళ తారక్ భౌతిక కాయాన్ని బెంగళూర్ నుంచి హైదరబాద్ తరలించనున్నారు. రేపు తారక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీనిపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news