తిరిగి వస్తాడు అనుకున్నా…కానరాని లోకాలకు వెళ్ళాడు – బాలయ్య

-

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇవాళ తారక్ భౌతిక కాయాన్ని బెంగళూర్ నుంచి హైదరబాద్ తరలించనున్నారు. రేపు తారక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీనిపై బాలయ్య బాబు స్పందించారు.

బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నానని బాలయ్య బాధపడ్డారు. నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు అన్నారు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని కోరారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news