యూపీ మాజీ సీఎం ములాయాం కు చంద్రబాబు నివాళులు

-

సమాజ్వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవాళ అధికార లాంచనాలతో జరగనున్నాయి. ములయం స్వగ్రామమైన సైఫాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సోమవారం స్వగ్రామానికిి తరలించారు. తమ అభిమాను నేత కడసారి చూపుల కోసం యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. మూలయం అంత్యక్రియలకు పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ భౌతిక కాయానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పార్టీ నేతలతో కలిసి మూలాయం స్వస్థలం యూపీలోని సైఫాయి వెళ్ళిన చంద్రబాబు.. అఖిలేష్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు మరి కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ములాయం కి నివాళులర్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news