అమరావతిలో ప్రారంభమైన చంద్రబాబు దీక్ష

-

అమరావతి: కోవిడ్‌తో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మాజీ ముఖ్యమంత్రి సాధన దీక్ష చేపట్టారు. అమరావతిలోని పార్టీ కార్యాలయలో ఆయన దీక్షకు దిగారు. ఈ దీక్షలో పలువరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్‌లో నష్టపోయిన తెల్లరేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు అందించాలని కోరారు.

ఇక చంద్రబాబు పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు సాధన దీక్ష చేపట్టారు. కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్టాడుతూ ఏడాదిగా ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news