ముఖం మీద ఉమ్మేసినా.. సిగ్గులేకుండా దొంగ ఓట్లు వేస్తున్నారు : వైసీపీ పై రెచ్చిపోయిన చంద్రబాబు

-

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న అరచకలపై టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చిపోయారు. వైసీపీ పార్టీ నాయకలు ఎన్నికలని అపహస్యం చేస్తున్నారని.. తప్పుడు పనులతో ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సిగ్గు, ఎగ్గు లేకుండా మొహం మీద ఉమ్మేస్తోన్నా.. తుడుచుకుని దొంగ ఓట్లేస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు చంద్రబాబు.

దొంగ ఓట్లేస్తున్న వారిని వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఏదోకటి చేసి గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని.. దొంగలకు పోలీసులు వంతపాడుతున్నారని ఆగ్రహం బీఆఖతం చేశారు. గత రాత్రే దొంగ ఓట్లేస్తున్న వారిని పట్టుకున్నా.. పోలీసులు అండతో తప్పించుకుని తిరుగుతున్నారని.. దొంగ ఓట్లేస్తున్నారని చెబితే టీడీపీ కార్యకర్తలను అరెస్టులు చేశారని మండిపడ్డారు చంద్ర బాబు . టీడీ పీ ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారని.. ఏజెంట్లను అరెస్ట్ చేసి దొంగ ఓట్లేసుకుంటున్నారని ఫైర్ అయ్యా రు చంద్ర బాబు.

Read more RELATED
Recommended to you

Latest news