సంతానం కోసం ఓ జంట దారుణం…యువతిని బందించి 16నెలల పాటు అత్యాచారం…!

-

త‌మ‌కు పుట్టిన ఇద్ద‌రు పిల్ల‌లు మ‌ర‌ణించ‌డంతో మ‌ళ్లీ సంతానం కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ యువ‌తిని బంధించి ఏకంగా భ‌ర్త 16 నెల‌ల పాటూ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఇక యువ‌తి గ‌ర్భం దాల్చిన త‌ర‌వాత బిడ్డ‌ను తీసుకుని ఆమెను బ‌స్టాండ్ లో ప‌డేశారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యినిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…ఉజ్జ‌యినిలోని క‌థ్ బ‌రోడా గ్రామానికి చెందిన మాజీ ఉప‌స‌ర్పంచ్ రాజ్ గోపాల్ సింగ్, చంద్ర కాంత అనే దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టి చ‌నిపోయారు.

ujjayini rape case update
ujjayini rape case update

అనంత‌రం మ‌ళ్లీ త‌మ‌కు సంతానం కావాల‌ని కోరుకున్నారు. అది కుద‌ర‌క‌పోవడంతో ఓ మ‌హిళ స‌హాయంతో నాగ్ పూర్ లో 21 ఏళ్ల యువ‌తిని కొనుగోలు చేశారు. ఆయువ‌తిని 16 నెల‌లుగా బంధించి రాజ్ గోపాల్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దాంతో గ‌ర్భం దాల్చిన యువ‌తి గ‌త నెల 25 బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అనంత‌రం ఆ యువ‌తిని దేవాస్ బ‌స్టాప్ వ‌ద్ద ప‌డేసి వెళ్ళిపోయాడు. దాంతో బాధిత యువ‌తి పోలీసులను ఆశ్ర‌యించింది. నింధితుల‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభ‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారికి స‌హ‌కరించిన బంధువుల‌ను సైతం అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం యువ‌తిని విక్ర‌యించిన వారికోసం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news