జగన్ సర్కార్ పై చంద్రబాబు వివాదాస్పద ట్వీట్

-

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే…గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరుతో పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించాం.ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు… ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారాన్నరు.

ఐదేళ్ల టీడీపీ హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాం.మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు  “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించిందని పేర్కొన్నారు.జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే….ఇది జగన్ అహంకారమే.అంతేకాదు అంబేద్కరును దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టేనని ఫైర్ అయ్యారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news