పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత.. ప‌రామ‌ర్శించిన‌ చంద్రబాబు..

-

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. గురువారం అమరావతి అమరావతి సచివాలయంలో పీఏసీ సమావేశం జరుగుతుండగా పయ్యావులకు ఒక్కసారిగా చెమటలు పట్టి, వాంతులు చేసుకున్నారు వెంటనే స్పందించిన సిబ్బంది సెక్రటేరియట్‌లోని డిస్పెన్సరికి తరలించి చికిత్స చేయించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లో చేర్పించారు.

హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పయ్యావులను సోమవారం ఉదయం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులను విచారించారు. త్వరితగతిన పయ్యావుల కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news