పని చేయని నాయకులు మాకొద్దు..తప్పుకోండి : నేతలకు చంద్రబాబు వార్నింగ్

-

పని చేయని నాయకులు మాకొద్దు..తప్పుకోండని నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జుల పని తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఛార్జులు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనని.. పని చేయలేని ఇన్చార్జులు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండన్నారు. పని చేయని ఇన్ఛార్జులు పక్కకు తప్పుకుంటే పార్టీ ఏం బాధపడదని.. పని చేయలేని ఇన్ఛార్జులు తప్పుకుంటే కొత్త వారికి అవకాశం వస్తుందని స్పష్టం చేశారు.

పని చేయకుండా పదవులు వచ్చేయాలని.. పార్టీ అధికారంలోకి వచ్చేయాలని కోరుకుంటే అయ్యే పని కాదని.. చెప్పారు. కుప్పం నియోజకవర్గం పార్టీకి తిరుగులేని నియోజకవర్గం అని.. అక్కడి ఓటర్లకు నేనంటే అభిమానమని పేర్కొన్నారు. అలాంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఇబ్బంది పెట్టారని.. కుప్పంలో నన్నే ఇబ్బంది పెట్టారంటే.. మిగిలిన సెగ్మెంట్లల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండని హెచ్చరించారు. పార్టీలో ఉంటూ నష్టం చేసే వ్యక్తులను ఊపేక్షించనని.. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని వెల్లడించారు. రౌడీయిజాన్ని, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడాలని.. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలని పేర్కొన్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news