ఏపీ విద్యార్థులకు అలర్ట్‌..ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పులు !

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌. ఇంటర్‌ వార్సిక పరీక్షలు ప్రారంభమయ్యే తేదీలలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిన్న విడుదల చేసింది. ఒకే తేదీల్లో ఇంటర్‌ పరీక్షలు, జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ ను మార్చాలని ఆలోచన చేస్తున్నారు.

ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా.. నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ తేదీలను మార్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు మార్చాల్సి ఉంటుంది. వచ్చె నెల 20 వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్‌ 20 న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1, అదే నెల 21 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్షలు జరుగనున్నాయి. అయితే.. ఏప్రిల్‌ 16, 17, 18, 19, 20, 21 తేదీలలో జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్షలను నిర్వహించాలని ఏన్టీఏ నిర్ణయం తీసుకుంది. దీంతో 20, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షల తేదీలు మారే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news