కొంప‌ల్లిలో దార‌ణం.. డివైడ‌ర్‌ను ఢీకొన్న కారు ఇద్ద‌రు మృతి

-

హైద‌రాబాద్ లోని కొంప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక కారు కొంప‌ల్లిలో గ‌ల జాతీయ రాహ‌ద‌రిపై అతి వేగం గా వ‌చ్చి డివైడ‌ర్ ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ హైద‌రాబాద్ లోని ఉన్న జాతీయ రాహ‌దారిపై ఒక కారు.. మేడ్చ‌ల్ నుంచి కొంప‌ల్లి వైపుగా వ‌స్తుంది. కొంప‌ల్లి వ‌ర‌కు వ‌చ్చే స‌రికి కారు అతి వేగంగా ఉండ‌టంతో అదుపు త‌ప్పింది. దీంతో ఆ కారు జాతీయ రాహ‌దారి మ‌ధ్య‌లో ఉన్న డివైడ‌ర్ ను బ‌లం గా ఢీ కొట్టింది.

దీంతో కారులో ఉన్న వారిలో ఇద్ద‌రు అక్క‌డి క‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఏడు గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌మాదం స‌మ‌యంలో కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. కాగ‌ స్థానిక‌లు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో మేడ్చ‌ల్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్షత‌గాత్రుల‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత దేహాల‌ను పోస్టు మార్టం కోసం పంపించారు. అలాగే ఈ రోడ్డు ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news