రసమయి బాలకిషన్ పై చార్జ్ షీట్ విడుదల

-

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై చార్జ్ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్. ఈ సందర్బంగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో కేసీఆర్ గద్దెనెక్కారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని.. కానీ నియామకాలను ఆయన తన కుటుంబానికే పరిమితం చేసుకున్నారని ఆరోపించారు. నిజంగా కాళేశ్వరంతో కేసీఆర్ నీళ్లు తెస్తే.. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం కమీషన్లు దండుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపడం లేదన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను ఆదానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రయివేటీకరణ దిశగా మోదీ అడుగులు వేస్తున్నారని.. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ చేసింది కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్ రెండూ ఒక్కటేనన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news